Topics Topics Help/Instructions Help Edit Profile Profile Member List Register Paatha Gnyapakaalu - Archives from Old DB  
Search New Posts 1 | 2 | 8 Hours Search New Posts 1 | 3 | 7 Days Search Search Tree View Tree View Latest tweets Live Tweets   Hide Images

Rate this post by selecting a number. 1 is the worst and 5 is the best.

    (Worst)    1    2    3    4    5     (Best)

Author Message
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Fanno1
Yavvanam Kaatesina Bewarse
Username: Fanno1

Post Number: 6538
Registered: 03-2004
Posted From: 24.11.34.170

Rating: N/A
Votes: 0

Posted on Saturday, January 11, 2014 - 4:45 pm:   

నాడే చేసి చూపిన ఎన్.టి.ఆర్.
ఇదిలా ఉండగా, జాతీయ రాజకీయాలలో ఆమ్ ఆద్మీ పార్టీ ఒక సంచలనం అయింది. జాతీయ మీడియా, ముఖ్యంగా ఆంగ్ల భాషా పత్రికల మద్దతు పుష్కలంగా లభించడంతో 'ఆప్' ప్రభావం దేశవ్యాప్తంగా పలు నగరాలపై పడుతోంది. పట్టణ ప్రాంతాలకు చెందిన యువతతో పాటు విద్యావంతులు 'ఆప్' వైపు ఆకర్షితులు కావడం వల్ల లోక్‌సభ ఎన్నికలలో ఎవరికి నష్టం జరగబోతున్నదన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. యువత, విద్యావంతుల్లో నరేంద్ర మోదీకే ఎక్కువ ఆదరణ ఉంది. ఈ వర్గాలు 'ఆప్' వైపు మళ్లితే నరేంద్ర మోదీ విజయావకాశాలపై దాని ప్రభావం పడుతుంది. కాంగ్రెస్ పార్టీ ఒక పథకం ప్రకారం 'ఆప్'కు ప్రచారం కల్పిస్తోందన్న వాదన కూడా బలంగా వినిపిస్తోంది. కాంగ్రెస్ మద్దతుతోనే ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయడం గమనార్హం. జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌కు అనుకూలంగా వ్యవహరించే ఒక ఆంగ్ల పత్రిక ఇటీవలి కాలంలో 'ఆప్'కు భారీ ప్రచారం కల్పిస్తోంది. అదే పత్రిక మన రాష్ట్రంలో మాత్రం జగన్మోహన్‌రెడ్డికి విశేష ప్రాచుర్యం కల్పిస్తోంది. ఈ పరిణామాలన్నింటినీ గమనిస్తే ఒక పథకం ప్రకారం నరేంద్ర మోదీకి నష్టం చేయడానికే 'ఆప్'కు అవసరానికి మించిన ప్రచారం కల్పిస్తున్నారనీ, దీని వెనుక కాంగ్రెస్ హస్తం ఉందన్న అనుమానాలు కలుగుతున్నాయి. వాస్తవానికి ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ నాయకత్వంలో ఏర్పడిన 'ఆప్' ప్రభుత్వం పక్షం రోజులుగా తీసుకున్న నిర్ణయాలలో అసాధారణమైనవి ఏమీ లేవు. చరిత్ర తెలియకపోవడం లేదా ఉద్దేశపూర్వకంగా విస్మరించడం వల్ల 'ఆప్' తీసుకున్న నిర్ణయాలను 'న భూతో న భవిష్యతి' అన్నట్టుగా ప్రచారం చేస్తున్నారు.దక్షిణాది రాష్ట్రాలపై జాతీయ మీడియాకు ఉన్న వివక్ష కూడా ఇందుకు కారణం. నిజానికి ఇలాంటి నిర్ణయాలను తెలుగుదేశం వ్యవస్థాపకుడు దివంగత ఎన్.టి.రామారావు 30 ఏళ్ల క్రితమే అమలుచేసి చూపించారు. అయితే అప్పటి ఆయన నిర్ణయాలకు ఈ స్థాయిలో ప్రచారం లభించకపోగా, అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎద్దేవా చేసేది. ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టగానే ఎన్.టి.రామారావు.. అవినీతిపై కొరడా ఝళిపించారు. ప్రభుత్వ యంత్రాంగంలో క్రమశిక్షణ తీసుకురావడానికి ప్రయత్నించారు. ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ సొంత వాహనంలో సాదాసీదాగా ప్రయాణించడాన్ని గొప్పగా చెబుతున్నారు. నాడు ఎన్.టి.ఆర్. తన సొంత వాహనంలో ఎస్కార్ట్ ఆర్భాటం లేకుండా ప్రయాణించిన విషయాన్ని విస్మరిస్తున్నారు.


కొన్ని సందర్భాలలో ఎన్.టి.ఆర్. తన వాహనాన్ని స్వయంగా నడిపిన ఉదంతాలు ఉన్నాయి. ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించడానికి అప్పట్లోనే ఆయన గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేశారు. అవినీతిని అరికట్టడం కోసం 'ధర్మమహామాత్ర' అని నామకరణం చేసి ఇప్పటి లోకాయుక్త వ్యవస్థను అప్పుడే ఏర్పాటుచేసి విస్తృత అధికారాలు కట్టబెట్టడానికి ప్రయత్నిస్తే, నాటి ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ దుమ్మెత్తిపోసింది. సొంత మంత్రివర్గంలో సభ్యుడైన అప్పటి కార్మిక శాఖ మంత్రి రామచంద్రరావు అవినీతికి పాల్పడుతున్నారని తెలిసి అవినీతి నిరోధక శాఖ అధికారులతో ట్రాప్ చేయించి పట్టుకుని మంత్రివర్గం నుంచి తొలగించారు. ఈ చర్యకు అప్పుడు అభినందనలు లభించకపోగా, ఎన్.టి.ఆర్.ను విమర్శించినవారే ఎక్కువ. ఆయన చర్యలన్నీ డ్రామాలనీ, ఆయన రామారావు కాదు డ్రామారావు అని విమర్శించారు. ఉద్యోగులు సకాలంలో విధులకు హాజరుకావాలని ఆంక్షలు విధించడంతో ఉద్యోగుల నుంచి ఎన్.టి.ఆర్. తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొన్నారు. ఈ వ్యతిరేకత ఎంతదూరం వెళ్లిందంటే ఒక రోజు సాయంత్రం ఉద్యోగులు మూకుమ్మడిగా ముఖ్యమంత్రి కార్యాలయంపై దాడి చేశారు. పూలకుండీలను, ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు. అప్పుడు ఎన్.టి.రామారావు తన సీట్లోనే కూర్చుని ఉన్నారు. కొందరు మహిళా స్వీపర్లు ఎన్.టి.ఆర్. బల్లపైకి ఎక్కి శివతాండవం చేశారు. ఆ దుశ్చర్యలన్నింటినీ ఆయన మౌనంగా చూస్తూ ఉండిపోయారు. ఉద్యోగులు ఆయనపై చేయి చేసుకోవడం మినహా మిగతావన్నీ చేశారు. ఆ తర్వాత కొన్ని రోజులకు ఉద్యోగులలో క్రమశిక్షణ తీసుకురావడానికి ప్రయత్నించిన నాటి ఒరిస్సా ముఖ్యమంత్రి బిజూ పట్నాయక్‌పై కూడా ఉద్యోగులు దాడిచేసి చేయి చేసుకున్నారు. చొక్కా చింపేశారు.


ఎన్.టి.ఆర్. ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం ప్రభుత్వ భవనాలను తన నివాసానికి ఉపయోగించుకోలేదు. సొంత ఇంట్లోనే ఉండేవారు. ముఖ్యమంత్రిగా ఆయన ఒక్క రూపాయి మాత్రమే జీతంగా పొందేవారు. తన కార్యాలయంలో గానీ, నివాస భవనం వద్ద గానీ దుబారాను సహించేవారు కాదు. ముఖ్యమంత్రి నివాస గృహానికి వచ్చిన విలేకరులకు టీ, కాఫీలు కూడా ప్రభుత్వ సొమ్ముతో ఇచ్చేవారు కాదు. తెలిసిన విలేకరులు వస్తే అప్పట్లో ఎన్.టి.ఆర్. వద్ద పనిచేసిన హేమచంద్రప్రసాద్ (ఇప్పుడు జీవించి లేరు), లక్ష్మీనారాయణ తమ సొంత డబ్బుతో టీ తెప్పించి ఇచ్చేవారు. ముఖ్యమంత్రిగా తను వాడే సొంత వాహనాన్ని కుటుంబ సభ్యులు వాడటానికి కూడా ఎన్.టి.ఆర్. అనుమతించేవారు కాదు. ముఖ్యమంత్రిగా స్వేచ్ఛగా తిరిగిన ఎన్.టి.ఆర్. ఆ తర్వాతి క్రమంలో నక్సలైట్లకు సంబంధించి కొన్ని నిర్ణయాలు తీసుకోవలసి రావడం వల్ల రక్షణ చట్రంలోకి వెళ్లవలసి వచ్చింది. ఇదంతా చరిత్ర! నిజం కూడా! ఈ వాస్తవాన్ని విస్మరించి సింప్లిసిటీ అనేది అరవింద్ కేజ్రీవాల్‌తోనే ప్రారంభమైనట్టు ప్రచారం చేయడం ఎంతవరకు సబబు? మూడు దశాబ్దాల క్రితమే సంక్షేమం అంటే ఏమిటో ఎన్.టి.ఆర్. అమలుచేసి చూపించారు. అయితే అన్నింటిలో జవాబుదారీతనం ఉండాలన్న ఉద్దేశంతో ఉచితంగా ఇవ్వడాన్ని ఆయన వ్యతిరేకించారు. రైతులకు హార్స్ పవర్‌కు 50 రూపాయల వంతున విద్యుత్ అందించడం ఈ జవాబుదారీతనంలో భాగమే! ఒక్క రిక్షా కార్మికులకు మాత్రమే జనతా వస్త్రాల పేరిట ఉచితంగా ఏడాదికి రెండు జతల దుస్తులు అందజేశారు.


ఇప్పుడు ఢిల్లీలో ఇస్తున్నట్టు మంచినీళ్లను ఉచితంగా ఇవ్వలేదు. అయితే రక్షిత మంచినీటి సరఫరాకు చర్యలు తీసుకున్నారు. ఉచితంగా ఇవ్వడం, చార్జీలను తగ్గించడం వంటి చర్యలకు తెగింపు అవసరం లేదు. బరితెగింపు ఉంటే చాలు. ఎందుకంటే అనుచిత సంక్షేమ పథకాల వల్ల మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎలా తయారవుతుందో మనం చూస్తున్నాం. ఆయా పథకాల వల్ల ప్రజల్లో సోమరితనం ఏర్పడుతున్న విషయాన్ని గుర్తిస్తున్నాం. రేపటి గురించి ఆలోచించి, ఇవ్వాళ ఆకలితో చనిపోకుండా తగు జాగ్రత్తలు తీసుకుని భావి తరాలకు మంచి భవిష్యత్తు అందించాలనుకునేవాడే రాజనీతిజ్ఞుడు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఈ కోవలోకి వస్తారా? లేక సంప్రదాయ రాజకీయ పార్టీల తరహాలోనే ప్రజలను సంతృప్తిపర్చడానికి చౌకబారు గిమ్మికులు చేస్తారా? అన్నది వేచి చూడాలి!

http://www.andhrajyothy.com/node/53143#sthash.nFiHdsm3.dpuf

Topics | Last Hour | Last Day | Last Week | Tree View | Search | Help/Instructions | Program Credits Administration