Nayak
Kurra Bewarse Username: Nayak
Post Number: 4417 Registered: 04-2009 Posted From: 12.131.245.18
Rating: N/A Votes: 0 | Posted on Monday, October 07, 2013 - 2:15 pm: | |
Bothsa gurunchi article... నిప్పులు చిమ్ముకుంటూ నింగికి నేనెగిరిపోతే నిభిడాశ్చర్యంతో వీరు ….. ఆ: నెత్తురు కక్కుకుంటూ నేలకు నే రాలిపోతే నిర్ధాక్షీణ్యంగా వీరే ….. ……. ఆ: అంటూ శ్రీశ్రీ రాసిన కవిత గుర్తుకు వస్తుంది పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ఎదిగిన తీరు చూస్తే. 1988నాటికి అంటే సరిగ్గా పాతికేళ్ల క్రితం ఆయన కేవలం ఓ కార్యకర్త. అప్పటి శాసనసభ్యుడు పెనుమత్స సాంబశివరాజు కు నమ్మిన బంటు. ఆ తరువాత 199౦ లో నేదురుమిల్లి జనార్థనరెడ్డి సారథ్యంలో పెనుమత్స తొలిసారి రవాణా మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆనాటికి బొత్సకు వున్న ఆస్తి ఓ ఇల్లు, లాడ్జి. అప్పటికే ఆయన తండ్రి కొన్న కొంత భూమిని రియల్ ఎస్టేట్ సైట్లుగా చేసి అమ్మేసి వున్నారు. పెనుమత్స ప్రమాణ స్వీకారం చేసిన నెల తిరగకుండానే తొలిసారి ఓ అంబాసిడర్ కారు సత్తిబాబు చేతిలోకి వచ్చింది. సత్తిబాబుకు వున్న ప్లస్ పాయింట్ ఇటు తెలుగుదేశంతో కూడా సన్నిహిత సంబంధాలు వుండడం. అటు భీమిలి నియోజకవర్గంలో కూడా బొత్స బంధువులు తెలుగుదేశంలో వుండేవారు. తెలుగుదేశం విజయనగరం పట్టణ పార్టీ నేత యడ్ల రమణమూర్తి కూడా బొత్సతో మంచి సంబధాలు కలిగి వుండేవారు. దీంతో ఇలా అన్ని పార్టీలను తన కనుసన్నలలో వుంచుకునేవారు. ఇలాంటి నేపథ్యంలో పెనుమత్స మంత్రికావడంతో ఇక సత్తిబాబుకు అడ్డులేకుండా పోయింది. దాంతో అన్నిటా తానై చెలరేగిపోయాడు. జిల్లా సహకార బ్యాంకు పగ్గాలు చేపట్టాడు. మెలమెల్లగా తన విశ్వరూపం ప్రదర్శించి, పెనుమత్సను పక్కకు పెట్టాడు. ఓక్స్ వ్యాగన్ ఫ్యాక్టరీ వస్తుందని తెలిసి, భారీగా భూములు కొనుగొలు చేసారన్న వార్తలు అప్పట్లో వినవచ్చాయి. కానీ అది కాస్తా బొత్స అత్యుత్సాహంతో వెనక్కుపోయింది. కానీ బొత్స వ్యాపారాలు మాత్రం బహుముఖంగా విస్తరించాయి. ఆయనతో పాటు ఆయన బంధువులు కూడా రియల్ ఎస్టేట్ తదితర వ్యాపారాలు ముమ్మరంగా చేపట్టారు. బొత్స కుమారుడు కూడా సినిమా రంగంలో బినామీ పెట్టుబడులు పెట్టారన్న వార్తలు వున్నాయి. బండ్ల గణేష్ సినిమాలో బొత్స ఫెట్టుబడులు వున్నది వాస్తవం. ఇలా రకరకాల వ్యాపారాలు సాగించి, బొత్స బాగానే సంపాదించారు. ఎక్కువగా భూములపైనే కాక విజువల్ మీడియాలో కూడా పెట్టుబడులు పెట్టారు. సత్య విజన్ పేరిట స్వంత కేబుల్ టీవీ నెట్ వర్క్ ఏర్పాటు చేసుకున్నారు. వైఎస్ మరణించిన తరువాత ఆయనలో కొత్త ఆశలు పుట్టుకొచ్చాయి. అలాంటి సమయంలో తన బలం పెంచుకోవాలని చిరంజీవికి దగ్గర కావడం ప్రారంభించారు. చిరంజీవిని పార్టీలోకి తెచ్చి, ఆ దన్నుతో తాను ముఖ్యమంత్రి కావాలని పథక రచన చేసారు. పిసిసి పీఠం అయితే సాధించగలిగారు కానీ, కిరణ్ కుమార్ రెడ్డిని తోసిరాజని, ముందుకు వెళ్లలేకపోయారు. రాష్ట్రం విడిపోతే కాపులకు అధికారం లభిస్తుందన్న ఆలోచన, మరోపక్క అధిష్టానం దగ్గర మంచిగా వుండాలన్న ఉద్దేశం ఆయనను విభజనకు దగ్గర చేసాయి. కొన్నేళ్ల క్రితం కూడా విభజనపై ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేసి, ఉత్తరాంధ్ర విద్యార్ధుల ఆగ్రహాన్ని చవిచూసారు. ఇప్పుడు అదే మరింత పెరిగి పెరిగి ఇంతకు దారితీసింది. బొత్స ఇప్పుడు తన ఎదుగుదల చూసి ఓర్వలేక, కొందరు కుట్ర చేసి, ఉద్యమ కారులను రెచ్చగొడుతున్నారన్నట్లుగా మాట్లాడుతున్నారు. అది కూడా కొంత వరకు నిజం కావచ్చు. బొత్స ఎదిగిన తరువాత విజయనగరంలొ తెరవెనుక చక్రం తిప్పిన క్షత్రియ వర్గ ప్రాబల్యం తగ్గింది., అటు కాంగ్రెస్ ఇటు తెలుగుదేశం రెండింటిలోనూ క్షత్రియవర్గం చక్రం తిప్పేది. ఇప్పుడు జిల్లా మొత్తం బొత్స తానై ఎదిగారు. ఇది కొంత వరకు వారికి ఇబ్బందిగానే వుంది. మరొపక్క జిల్లాలో వున్న కుల సమీకరణలు వుండనే వున్నాయి. అవీ కాక, గద్దే బాబూరావు స్థానాన్ని కైవసం చేసుకుని, అక్కడ జెండా పాతడం ద్వారా కమ్మవారి కోపానికి కూడా కారణమయ్యారు. జిల్లాలోని రామభద్రపురం, సాలూరు, తదితర ప్రాంతాల్లో వున్న ఈ వర్గానికి కూడా బొత్స అంటే పెద్దగా కిట్టదని అంటారు. మరోపక్క ముఖ్యమంత్రితో వున్న వైరం తెలిసిందే. ఇప్పుడు అన్నీ కలిసి ఏకంగా ఇంతయింది. Warrior
|